అమెరికా నుంచి మన 'అప్సర' శిల్పం వచ్చేస్తోంది!

  • దశాబ్దాల క్రితం తరలిపోయిన పురాతన శిల్పం
  • ప్రస్తుతం లాస్ ఏంజెలిస్ మ్యూజియంలో
  • తిరిగి ఇచ్చేందుకు అంగీకరించిన అమెరికా
ఎన్నో దశాబ్దాల క్రితం అమెరికాకు తరలిపోయిన ఓ అద్భుత శిల్పం తిరిగి ఇండియాకు రానుంది. వివిధ దేశాల్లో ఉన్న పురాతన భారత శిల్ప సంపదను తిరిగి తెప్పించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా, ప్రస్తుతం లాస్ ఏంజెలిస్ మ్యూజియంలో ఉన్న 'అప్సర'ను తిరిగి ఇండియాకు ఇచ్చేందుకు అక్కడి అధికారులు అంగీకరించారు.

ఈ శిల్పానికి వెలకట్టలేమని, దీన్ని ఇచ్చేందుకు అమెరికా అంగీకరించిందని కేంద్ర సాంస్కృతిక శాఖ వర్గాలు తెలిపాయి. కాగా, మధ్య భారత దేశంలో పదకొండవ శతాబ్దానికి చెందిన శిల్పంగా దీన్ని భావిస్తున్నారు. 
Go Back to Shorts
Apsara
India
USA

More Telugu News